

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఏడుగురు సభ్యులు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్కు చెందిన రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలకు రేణుకా చౌదరి మరియు అనిల్కుమార్ యాదవ్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్ఎస్కు చెందిన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ ఖాళీ స్థానాన్ని సింఘ్వీకి కేటాయించడంతో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ సభ్యుల సంఖ్య మూడు అయింది.
ఇక బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి మరియు కాంగ్రెస్ సభ్యుడు సింఘ్వీ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9 న ముగియనుంది. ఈ రెండు స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. తాజా ఎన్నికల్లో సింఘ్వీతో పాటు వేం నరేందర్రెడ్డి ఎన్నికవుతారని భావిస్తున్నారు. దీంతో తెలంగాణ నుంచి రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య నాలుగుకు పెరగనుంది.
ఇక సురేశ్రెడ్డి పదవీకాలం పూర్తయిన తరువాత బీఆర్ఎస్ తరఫున పార్థసారధి రెడ్డి, దామోదర్రావు మరియు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో కొనసాగనున్నారు. పార్థసారధి రెడ్డి, దామోదర్రావుల పదవీకాలం 2028 జూన్ 21 వరకు కొనసాగనుంది. మరో సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం 2030 ఫిబ్రవరి 19 వరకు కొనసాగనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!