
క్రీడలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు సూచించాయని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. వారి విజ్ఞప్తులను అన్ని కోణాల్లో పరిశీలించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన సీఈసీ, ఎస్ఐఆర్ ప్రక్రియ దేశానికి మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో అధికారులు ప్రొఫెషనలిజం కనబరిచారని ప్రశంసించారు. ఓట్ల లెక్కింపు పూర్తైన ఏడు రోజుల వరకు వీవీపాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చుకునే అవకాశం అభ్యర్థులకు ఇస్తామని, పోస్టల్ బ్యాలెట్లను ఈవీఎం కౌంటింగ్కు ముందు రెండు రౌండ్లలో లెక్కిస్తామని తెలిపారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!