

సోషల్ మీడియాలో వ్యంగ్య రాజకీయ వేదికగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వేదికకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ అసహనానికి గురవుతోందని కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య నిరసనలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. సీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు, అలాగే వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వ్యక్తిగత ఖాతా సస్పెన్షన్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
యువ కార్యకర్త అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఈ వేదిక అతి తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ను సంపాదించింది. కొన్ని సోషల్ మీడియా వేదికల్లో అధికార పార్టీలకంటే ఎక్కువ స్పందన రావడం గమనార్హం. ఈ నిరసనను కేవలం వ్యంగ్య రాజకీయంగా కాకుండా ప్రజల భావవ్యక్తీకరణగా చూడాలని పినరయి విజయన్ పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ఈ ‘కాక్రోచ్’ ఉద్యమం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!