

ఉగాది వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై పలు ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.
ప్రజలందరికీ చేరువగా ఉండాలని తన ఆకాంక్షను వ్యక్తం చేసిన ఆయన, దుష్టుల మోసపూరిత చర్యల పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని చెప్పారు. ఇప్పటికే 10,060 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని వెల్లడించారు. అలాగే మెగా డీఎస్సీ ద్వారా 15,940 మంది ఉపాధ్యాయులకు, 5,757 మంది పోలీసు కానిస్టేబుళ్లకు ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.
మొత్తంగా 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేట్ రంగంలో 6.28 లక్షల మందికి ఉపాధి లభించినట్లు చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్లు జారీ చేసి మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
కంజ్యూమర్ జస్టిస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఒక నివేదిక వెల్లడించిందని చెప్పారు. వినియోగదారుల హక్కులను కాపాడే రాష్ట్రంగా ఏపీ ముందంజలో ఉందని పేర్కొన్నారు. 2047 నాటికి సంపన్నం, ఆరోగ్యకరం, సంతోషకరమైన సమాజంగా ఆంధ్రప్రదేశ్ మారాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
పరాభవ నామ సంవత్సరంలో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!