

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని ఆ పార్టీ నేత రాంచందర్రావు తెలిపారు. అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యం కారణంగా కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ నారాయణపేట, ఆదిలాబాద్, కొత్తగూడెం, వైరా ప్రాంతాల్లో తొలిసారిగా బీజేపీ విజయం సాధించడం పార్టీ బలం పెరుగుతున్న సంకేతమని పేర్కొన్నారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో బీజేపీకి మరింత బలాన్ని అందిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అనేక వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయామని రాంచందర్రావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి సుమారు 20 శాతం ఓట్ల పెరుగుదల నమోదైందని, అదే సమయంలో బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు సంకేతమని, రానున్న ఎన్నికల్లో బీజేపీ మరింత శక్తిగా ఎదుగుతుందని ఆయన అన్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!