
క్రీడలు

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కేంద్రమంత్రి బండిసంజయ్ తనయుడు భగీరథ్పై నమోదైన కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇది బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన అంశమని, భాజపా పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
బండి భగీరథ్ కేసుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని రామచందర్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో సంజయ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!