
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్లోని ఫల్టా నియోజకవర్గానికి నిర్వహించిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దెబాంగ్షూ పాండా ఘన విజయం సాధించారు. ఆయన లక్షా తొమ్మిది వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఎంసీకి కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నాలుగో స్థానానికి పరిమితం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఫల్టా నియోజకవర్గంలో మొత్తం 2.36 లక్షల ఓటర్లు ఉండగా, బీజేపీ అభ్యర్థి దెబాంగ్షూ పాండాకు సుమారు 1.49 లక్షల ఓట్లు లభించాయి. సీపీఎం అభ్యర్థి శంభూనాథ్ కుర్మీ 40 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల నేపథ్యంలో ఎన్నికల సంఘం మొత్తం నియోజకవర్గానికి రీపోలింగ్ నిర్వహించడం విశేషం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!