

ఈటల రాజేందర్ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కొంత భాగం కుంగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంపుహౌస్ల నుంచి నీటిని పూర్తిగా విడుదల చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రాజెక్టులో జరిగిన లోపాలకు బాధ్యులైన వారిని శిక్షించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కోరారు. సోమవారం భాజపా కార్యాలయంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కొంత మేర కుంగిన విషయం నిజమేనని అంగీకరించిన ఆయన, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు లేకపోవడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల వ్యవస్థలో అందుబాటులో ఉన్న పంపుహౌస్ల నుంచి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!