

బీహార్ రాజకీయాల్లో నెలకొన్న సస్పెన్స్కు ముగింపు పలకబడింది. ఎన్డీఏ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది. బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ, 2027 వరకూ జరగబోయే రాష్ట్ర ఎన్నికలు, రాబోయే రాష్ట్రపతి ఎలక్షన్, అలాగే బీహార్ ప్రజలకు ఇచ్చిన హామీలు పరిగణలోకి తీసుకున్న తర్వాత కీలక నిర్ణయం వెలువడింది. ఈ నెల 20 న కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానుంది.
బీహార్లో మళ్లీ నితీశ్ కుమార్నే ముఖ్యమంత్రిగా కొనసాగించేలా బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 243 స్థానాల్లో ఎన్డీఏ కూటమి 202 సీట్లు దక్కించుకుంది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ (రామ్ విలాస్) 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎస్పీ 4 స్థానాలు గెలుచుకున్నాయి. తాజా ఫలితాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఎదగడంతో, సీఎంగా బీజేపీ నాయకుడిని ప్రకటిస్తారన్న ప్రచారం మొదలైంది. దీనిపై బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ స్పష్టత ఇచ్చారు. నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు.
బీజేపీ శాసనసభ పక్షం రేపు ఉదయం 10 గంటలకు సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకోనుంది. వెంటనే ఎన్డీఏ కూటమి సమావేశమై నితీశ్కు సీఎం పదవిని అధికారికంగా అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తుంది. నవంబర్ 20 న పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ వేదికగా ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రధాన అతిథిగా ప్రధాని మోదీతోపాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
నూతన కేబినెట్లో బీజేపీ, ఎల్జేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉండనున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు నితీశ్ ముందు ప్రధాన సవాలుగా మారనుంది. బీజేపీ మాత్రం దీర్ఘకాలిక వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని నితీశ్కు మద్దతు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!