
క్రీడలు

పశ్చిమబెంగాల్ లోని బీజేపీ ప్రభుత్వం అధికారిక వేదికల నుంచి ‘బిశ్వ బంగ్లా’ లోగోను తొలగించడం ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో ప్రవేశపెట్టిన ఈ బ్రాండింగ్ స్థానంలో భారత జాతీయ చిహ్నమైన అశోక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాల్ట్ లేక్ స్టేడియం వద్ద ఉన్న బిశ్వ బంగ్లా బోర్డును తొలగించి అశోక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.
‘ఎగియే బంగ్లా’ పోర్టల్ సహా ప్రభుత్వ డిజిటల్ వేదికలలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. తెలుపు-నీలం రంగుల థీమ్ స్థానంలో కాషాయ రంగును చేర్చారు. పర్యాటకం, వ్యవసాయం, పరిశ్రమల విభాగాల ఐకాన్లను కూడా కొత్తగా రూపొందించారు. ఒక వ్యక్తి రూపొందించిన లోగో ప్రభుత్వ అధికారిక చిహ్నంగా ఉండకూడదని బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అప్డేట్ చేసిన పోర్టల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫొటోను కూడా ఉంచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!