
జనరల్

సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రచారం చేశారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం తెలిపారు. సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు గానీ, ప్రభుత్వానికి గానీ లేదని స్పష్టం చేశారు.
సాయిబాబా భక్తుల విశ్వాసాలను, ఆధ్యాత్మిక భావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. అన్ని మతాలు, విశ్వాసాల పట్ల గౌరవం ప్రభుత్వ విధానమని మరోసారి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!