
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లుతో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామాలు మరియు స్వర్ణ వార్డులుగా పిలవనున్నారు.
గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఆ విజన్ ప్రకారం సచివాలయాల విధులు, పనితీరులో మార్పులు చేస్తున్నామని చెప్పారు. దానికి అనుగుణంగా పేర్లు కూడా మారుస్తూ ఈ చట్ట సవరణను తీసుకువచ్చామని మంత్రి వివరించారు.
ఈ మార్పులతో రాష్ట్ర అభివృద్ధి దిశగా మరిన్ని సేవలు గ్రామ, వార్డు స్థాయిలో వేగంగా అందించగలమని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!