
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు తిరుచ్చి పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా తిరుచ్చిని సందర్శించనున్న నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పర్యటనలో భాగంగా సీఎం విజయ్ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!