

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే తమ రెండో విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పలు కీలక హామీలను ఈ మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రతి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పెన్షన్లను పెంచి నెలకు రెండు వేల రూపాయలుగా చేస్తామని తెలిపింది. అలాగే విద్యార్థుల పై ఉన్న విద్యా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించింది.
గ్రామీణ సంస్కృతి, సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ జల్లికట్టు నిర్వహణ కమిటీలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. జల్లికట్టు సమయంలో గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ క్రీడలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
ఈ హామీలతో తమ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నాడీఎంకే నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!