

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ ఇప్పుడు మూడో భాగంతో ఓటీటీలోకి అడుగుపెట్టింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దృశ్యం 3’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి రెండు భాగాలు సస్పెన్స్, ఎమోషన్, ఉత్కంఠభరిత కథనంతో బ్లాక్బస్టర్ విజయాలు సాధించగా, ఈ మూడో భాగం కూడా అదే మేజిక్ను కొనసాగించే ప్రయత్నం చేసింది.
మోహన్లాల్ 66వ పుట్టినరోజు సందర్భంగా మే 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. కథలో ఉత్కంఠ ఉన్నప్పటికీ, తొలి రెండు భాగాల స్థాయిలో థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడం కొంతమంది ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇప్పుడు ఈ చిత్రం జూన్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినా, ఓటీటీలో మంచి ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!