

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ థియేట్రికల్ రన్ను పూర్తి చేసుకుని ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. కుటుంబ గౌరవం, వ్యాపార విలువలు, తండ్రీకొడుకుల అనుబంధం, తరాల మధ్య ఆలోచనా విధానాల్లో మార్పు వంటి అంశాల చుట్టూ కథ సాగుతుంది.
తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడయ్యాయి. నెట్ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 11, 2026 నుంచి ‘విశ్వనాథ్ & సన్స్’ స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాతో మమితా బైజు వరుసగా మూడోసారి 30 రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంలో భాగమైన నటిగా అరుదైన గుర్తింపు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. భవానీ శ్రీ, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్, నాజర్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!