

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను కొనసాగిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతి శెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జూన్ 4న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సుమారు ₹110 కోట్లకు సొంతం చేసుకుంది. ఇటీవల నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్లో చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹420 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం జూలై 16 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒప్పంద నిబంధనల్లో మార్పులు జరిగితే అంతకంటే ముందే ఓటీటీలోకి వచ్చే అవకాశమూ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!