

అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ చాలామంది పట్టించుకోవడం లేదు. అన్నమయ్య జిల్లాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కురుబలకోట మండలం సర్కారుతోపు దగ్గర బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బి.కొత్తకోటకు చెందిన సురేంద్ర, మదనపల్లికు చెందిన మాధవ, మహేశ్ స్నేహితులు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మదనపల్లి శివారులో అమ్మచెరువుమిట్ట దాటిన తర్వాత జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం మరోసారి రోడ్డు భద్రతపై జాగ్రత్తలు అవసరమని గుర్తు చేస్తోంది.









.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!