
సినిమాలు

దిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూకశ్మీర్లో ఈరోజు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. తెల్లవారుజామునే తనిఖీలు ప్రారంభించి, హంద్వారాలోని ఓ వ్యాపారి ఇంట్లో రైడ్స్ చేపట్టింది. ఈ కేసులో అరెస్టైన నిందితులకు ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తులతో అతనికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే పుల్వామా, కుల్గాం, షోపియన్, బారాముల్లా, కుప్వాడా జిల్లాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆయుధాలు సరఫరా చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు స్లీపర్ సెల్స్గా పనిచేస్తూ ఉగ్ర సంస్థలకు సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 11 కు చేరింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!