

టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ 2026ను ఘనంగా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయం పై పలువురు ప్రముఖ క్రికెటర్లు స్పందిస్తూ భారత జట్టును అభినందించారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను ప్రశంసిస్తూ, కోచ్ సాబ్ మొహంపై చిరునవ్వు చాలా బాగుంటుందని అన్నారు. విజయం సాధించాలనే ఆయన పట్టుదల, చిరునవ్వు కలయిక కిల్లర్ కాంబినేషన్ అని చెప్పారు. అలాగే జస్ప్రీత్ బుమ్రాను ఛాంపియన్ బౌలర్గా అభివర్ణిస్తూ, అతడి విజయాలను ఒకే పదంతో చెప్పలేమని ధోని పేర్కొన్నారు.
ఈ చారిత్రక విజయంపై ఇతర దిగ్గజ క్రికెటర్లు కూడా స్పందించారు. టీ20ల్లో 25–30 పరుగుల తేడాతో గెలిచినా అది పెద్ద విజయమేనని, కానీ ఇది అంతకంటే భారీ విజయమని సునీల్ గవాస్కర్ అన్నారు. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచిందని సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. భారత జట్టులోని ప్రతి ఆటగాడు అద్భుతంగా ఆడారని రోహిత్ శర్మ అభినందించారు. టోర్నమెంట్ అంతటా ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటారని విరాట్ కోహ్లీ పేర్కొంటూ, సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించారు. మ్యాచ్ను గల్లీ క్రికెట్లా సులభంగా పూర్తి చేశారని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఈ విజయం నమ్మకం, వ్యక్తిత్వం, జట్టు కృషికి నిదర్శనమని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!