

దక్షిణ భారత సినీ పరిశ్రమలో నటించేందుకు ఒకప్పుడు ఆసక్తి చూపని బాలీవుడ్ నటులు, ఇప్పుడు టాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. తెలుగు సినిమాల పెరుగుతున్న ప్రాచుర్యం మరియు బాక్సాఫీస్ మార్పులు అనేకమంది హిందీ నటులను తెలుగు సినిమాల్లో నటించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ జాబితాలో బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా కూడా చేరారు. ఆమె తెలుగు నటుడు సుధీర్ బాబు హీరోగా నటించిన సూపర్నాచురల్ థ్రిల్లర్ జటాధర సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె లోభ దేవత ధనపిశాచినిగా నటించి, శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకులపై ముద్ర వేసేలా ఉందని అందరూ భావించారు.
కానీ విడుదల అనంతరం సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు చాలా నిరాశపరిచాయి. కథ, నటన, దర్శకత్వం — ఏ అంశం కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకోలేదు. సోనాక్షి పాత్రకూ పెద్దగా గుర్తింపు రాలేదు. దబాంగ్ బ్యూటీకి ఇది ఒక శుభారంభం అవుతుందని అనుకున్నా, చివరికి ఇది ఒక చెడు అనుభవంగా మారింది. జటాధర విఫలం కావడంతో సోనాక్షి టాలీవుడ్లో ఉన్న ఆశలు పూర్తిగా చిద్రమయ్యాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!