

ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. లోక్మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆమె కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆశా భోస్లే తన మధుర గాత్రంతో సినిమా పాటలు మాత్రమే కాకుండా గజల్స్, ఖవ్వాలీలు, శాస్త్రీయ కచేరీలలో కూడా విశేష గుర్తింపు పొందారు. వేదిక ఏదైనా తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ గాయనిగా ఆమె నిలిచారు. పదేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించిన ఆమె, సుమారు 800కు పైగా చిత్రాల్లో 12 వేలకుపైగా పాటలు ఆలపించారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరిగా ఆశా భోస్లే అనేక మరపురాని గీతాలను అందించారు.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!