

తెలుగు, తమిళ భాషల్లో తల్లి పాత్రలతో ప్రత్యేకస్థానం సంపాదించుకున్న సీనియర్ నటి తులసి భావోద్వేగపూర్వకమైన ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా తనకు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం మూడు నెలల వయసులోనే సినిమాల్లో అడుగు పెట్టిన ఆమె 58 ఏళ్ల సినీజర్నీకి ఇది ముగింపు. సాయి బాబా పాదాల ఫోటోను షేర్ చేస్తూ, తనకు, తన కుమారుడు సాయికి దీవెనలు కోరుకుంటూ ఆమె మొదటి పోస్టు పెట్టారు.
తర్వాత, తన అంతరాత్మను నమ్ముకోవడం, కొత్త స్వేచ్ఛను ఆత్మీయంగా ఆహ్వానించడం గురించి రాసిన తులసి, ఈ నెల 31న షిరిడీ దర్శనం తర్వాత తన శాంతిమయమైన కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపారు. “హ్యాపీ రిటైర్మెంట్” అంటూ స్వయంగా తనకే శుభాకాంక్షలు తెలుపుకున్న ఆమె, తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కామెంట్స్ సెక్షన్ను ఆమె డిసేబుల్ చేశారు.
బాలనటిగా సీతామహాలక్ష్మి, శంకరాభరణం, ముద్ద మందారం వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న తులసి, దర్శకుడు శివమణిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం దూరమయ్యారు. ఆ తర్వాత తిరిగి నటనలోకి వచ్చి మిస్టర్ పర్ఫెక్ట్, ఇద్దరమ్మాయిల తో, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్సిరీస్లో కూడా మెప్పించారు. దాదాపు ఆరు దశాబ్దాల సినీజీవితానికి ఆమె రిటైర్మెంట్ ఒక యుగానికి ముగింపు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!