
జనరల్

ఫిల్మ్ చాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య మరోసారి కీలక సమావేశం జరిగింది. అయితే పర్సెంటేజ్ విధానంపై ఇంకా పూర్తి స్థాయి సయోధ్య కుదరలేదు. పెద్ది సినిమాకి కూడా పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ పట్టుబడుతున్నట్లు సమాచారం.
కాస్త తక్కువ శాతం అయినా సరే పర్సెంటేజ్ కావాలని ఎగ్జిబిటర్స్ చెబుతుండగా, నిర్మాతలు రెంట్తో పాటు 7.5 శాతం వరకు ఇవ్వడానికి సిద్ధమని వెల్లడించినట్లు తెలుస్తోంది. భవిష్యత్ సినిమాలకు పర్సెంటేజ్ ఎంత ఇస్తారో పెద్ది రిలీజ్కు ముందే లేఖ రూపంలో ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ కోరారు. ఈ అంశంపై నిర్మాతలు రేపు తమ నిర్ణయం ప్రకటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!