

నటి తమన్నా భాటియా తాజాగా కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ నిర్వహించిన వ్లాగ్లో పాల్గొని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్తో తనకున్న ఓ ప్రత్యేక అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమకు షారుఖ్ చేసిన సేవలు అసాధారణమని పేర్కొన్న ఆమె, ఆయన కేవలం స్టార్ హీరో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించే గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ స్వయంగా ఫోన్ చేసి తన కుమారుడు ఆర్యన్ ఖాన్ రూపొందిస్తున్న ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రాజెక్ట్లోని “గఫూర్” పాటలో నటించాలంటూ ఆహ్వానించారని తమన్నా వెల్లడించారు. ఆ కాల్ తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణమని ఆమె తెలిపారు. షారుఖ్ ఎంతో సాదాసీదాగా అడగడంతో ఎలాంటి రెండో ఆలోచన లేకుండా వెంటనే అంగీకరించానని చెప్పారు. గతంలో ఇద్దరూ కొన్ని ప్రకటనల్లో కలిసి కనిపించినప్పటికీ, ఇప్పటివరకు ఒక ఫీచర్ ఫిల్మ్లో కలిసి నటించలేదు. ఇదిలా ఉండగా, షారుఖ్ ప్రస్తుతం కింగ్ చిత్రంతో బిజీగా ఉండగా, తమన్నా వ్వాన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ విడుదలకు సిద్ధమవుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!