

డిజిటల్ సినిమా పైరసీని సమర్థవంతంగా అరికట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా పైరసీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫార్ములు, మెసేజింగ్ యాప్లు, IPTV స్ట్రీమ్స్, మొబైల్ అప్లికేషన్లలో జరుగుతున్న డిజిటల్ పైరసీపై రియల్-టైమ్ పర్యవేక్షణ, తక్షణమే పైరసీ కంటెంట్ తొలగింపు, అలాగే చట్టపరమైన చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు.
సినిమా విడుదలైన వెంటనే జరిగే పైరసీ వల్ల పరిశ్రమకు కలిగే భారీ నష్టాలను నివారించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, టీఎఫ్సీసీ అధ్యక్షుడు డి. సురేష్ బాబు, గౌరవ కార్యదర్శి కె. అశోక్ కుమార్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తో పాటు ప్రముఖ నిర్మాతలు, యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.






.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!