

దర్శకురాలు సుధా కొంగర తన చిత్రం ‘పరాశక్తి’కి సంబంధించిన పారితోషిక వివాదంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రాజకీయ యాక్షన్ డ్రామాను డాన్ పిక్చర్స్ నిర్మించగా, 2026లో విడుదలై 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ తనకు ఇవ్వాల్సిన రూ.8 కోట్ల మిగిలిన పారితోషికాన్ని చెల్లించలేదని సుధా కొంగర ఆరోపించారు.
విచారణ సందర్భంగా సుధా కొంగర తరపు న్యాయవాది, బకాయి చెల్లించకుండానే అదే నిర్మాణ సంస్థ ‘ఇదయం మురళి’ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మద్రాసు హైకోర్టు, సుధా కొంగరకు పూర్తి పారితోషికం చెల్లించే వరకు ‘ఇదయం మురళి’ విడుదల చేయరాదని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణ వరకు ‘పరాశక్తి’ చిత్రాన్ని శాటిలైట్ ప్లాట్ఫారమ్లలో విడుదల చేయకూడదని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!