

‘పుష్ప 2’ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట లో భాస్కర్ భార్య రేవతి మరణించగా, వారి కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి ఏడాది అవుతున్న సందర్భంలో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు భాస్కర్ కుటుంబంతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలిపారు. శ్రీతేజ్ ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్నాడని, చికిత్స కోసం అవసరమైన సహాయం కొనసాగుతోందని తెలిపారు. అల్లు అర్జున్ రూ. 2 కోట్లు శ్రీతేజ్ పేరుతో డిపాజిట్ చేయడం వల్ల, ప్రతి నెల రూ. 75,000 వడ్డీ కుటుంబ ఖర్చులు మరియు చికిత్సకు ఉపయోగపడుతోంది. అదనంగా, అల్లు అర్జున్–అల్లు అరవింద్ కలిసి రూ. 75 లక్షలు ఆసుపత్రి ఖర్చుల కోసం ఇప్పటికే చెల్లించినట్లు దిల్ రాజు తెలిపారు.
శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన రెండో రోజు నుంచే అల్లు అర్జున్ కుటుంబం సహాయాన్ని అందిస్తోందని, ఇప్పుడు రిహాబిలిటేషన్ కోసం అదనపు సహాయం అవసరమైందని చెప్పారు. ఈ విషయాన్ని దిల్ రాజు దృష్టికి తీసుకెళ్లగా, అల్లు అర్జున్ వెంటనే అంగీకరించారని తెలిపారు. బాబు పూర్తిగా కోలుకునే వరకు, అవసరమైతే మరో ఏడాది వరకు కూడా రిహాబిలిటేషన్ సదుపాయం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని దిల్ రాజు స్పష్టం చేశారు.
.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!