

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీతా పయనం’ ఈ నెల 14 న విడుదలకు సిద్ధమైంది. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై అర్జున్ నిర్మించిన ఈ సినిమాతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా ప్రత్యేక పాత్రలో నటించారు. మీడియాతో మాట్లాడుతూ, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యూనివర్సల్ ఫీల్ గుడ్ కథ అని, అందుకే నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నామని అర్జున్ తెలిపారు.
ఈ చిత్రం కేవలం ప్రేమకథకే పరిమితం కాకుండా, కుటుంబ బంధాలు, పరిపక్వత, భావోద్వేగాలు, దేశభక్తి వంటి అంశాలను సున్నితంగా చూపిస్తుందని అర్జున్ అన్నారు. కథకు అవసరమైనంతవరకే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, అవి సహజంగా సాగుతాయని స్పష్టం చేశారు. ఫాదర్–డాటర్ రిలేషన్ను ఇప్పటివరకు చూడని విధంగా చూపించామని, జెన్ జీ నుంచి పెద్దల వరకూ కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!