
జనరల్

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్కు వచ్చినట్లు ప్రచారంలో ఉన్న బెదిరింపు సందేశాల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు భద్రతను పెంచారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందినట్లు తనను పరిచయం చేసుకున్న ఆర్జూ బిష్నోయ్ అనే వ్యక్తి పంపిన సందేశం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఆమిర్ ఖాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి, పోలీసు నిఘాను మరింత పెంచినట్లు సమాచారం.
మహారాష్ట్ర హోం (అర్బన్) మంత్రి యోగేష్ రామ్దాస్ కదం మాట్లాడుతూ, పోలీసులు ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని, అవసరమైతే భద్రతను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. వైరల్ అయిన సందేశంలో ఆమిర్ ఖాన్పై ‘లవ్ జిహాద్’ ఆరోపణలు చేస్తూ హెచ్చరికలు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!