
రాజకీయాలు

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్ర విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదాత్మక అంశాలు కలగలిసిన చిత్రంగా ఇది రూపొందుతున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటిస్తుండగా, రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని జివి ప్రకాష్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ ప్రకటనతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!