

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను దాటింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు టికెట్ సేల్స్ కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. బుక్మైషో, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్ఫారమ్లలో 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. వీకెండ్ తర్వాత కూడా వర్కింగ్ డేస్లో సినిమా మంచి ఆక్యుపెన్సీని కొనసాగిస్తుండటంతో బాక్సాఫీస్ రన్పై ఆసక్తి నెలకొంది.
ఇక ‘ఇరుముడి’ని చూసిన హీరోయిన్ రష్మిక మందన్నా సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సినిమా తనను ఊహించని విధంగా భావోద్వేగానికి గురిచేసిందని పేర్కొంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించింది. ముఖ్యంగా సినిమాలోని సున్నితమైన సామాజిక అంశాన్ని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారని అభినందించింది. రవితేజ నటనను ప్రశంసించిన రష్మిక.. బేబీ నక్షత్రను కూడా ప్రత్యేకంగా అభినందించింది. నక్షత్ర సినిమాలో సన్షైన్లా కనిపించిందని, ఆమె చిరునవ్వు తనను కూడా నవ్వించిందని పేర్కొంది. దర్శకుడు శివ నిర్వాణ కథ, స్క్రీన్ప్లే, మేకింగ్ను ప్రశంసిస్తూ ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. విజయ్ దేవరకొండ కూడా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్, బలమైన టికెట్ డిమాండ్ నేపథ్యంలో ‘ఇరుముడి’ మరిన్ని రికార్డులు సాధిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!