
జనరల్

బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం రామాయణ ట్రైలర్ లాంచ్తో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నితీష్ తివారి అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ అనంతరం తక్కువ నాణ్యతలో లీకైన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
అయితే ఆ లీకైన క్లిప్స్ ఆధారంగా సినిమాపై ముందుగానే నిర్ణయానికి రావడం సరికాదని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. అధికారిక హై క్వాలిటీ ట్రైలర్ విడుదలైన తర్వాతే సినిమా అసలు విజువల్ అనుభూతి తెలుస్తుందని చెబుతున్నారు. హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!