

దక్షిణ భారత సినీ లెజెండ్స్ రజినీకాంత్ – నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 ఏళ్ల విజయయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా, వారికి గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకలో ఘన సన్మానం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ మీడియాకు వెల్లడించారు.
ఈ సన్మానం, ఇద్దరు స్టార్ల ఐదున్నర దశాబ్దాల సినీజీవితానికి, భారతీయ సినీ సంస్కృతిపై వారి ప్రభావానికి, అద్భుతమైన చిత్రకళా ప్రయాణానికి గుర్తింపని ఆయన అన్నారు. రజనీ, బాలయ్య ఇద్దరూ దక్షిణ భారత సినీ పరిశ్రమకు దృఢమైన ఆధార స్తంభాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే.
రజినీకాంత్ 1975లో అపూర్వ రాగంగల్ తో ఎంట్రీ ఇచ్చి, వరుస విజయాలతో ఇండియన్ సినిమా ఐకాన్గా నిలిచాడు. బాలకృష్ణ ఇప్పటివరకు 100కు పైగా చిత్రాల్లో నటించి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హిందూపురం ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఆయనకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. నవంబర్ 20 నుండి 27 వరకు జరిగే IFFIలో 84 దేశాల నుండి వచ్చిన 270 సినిమాలు ప్రదర్శించబడతాయి. మొత్తం 7500మంది ప్రతినిధులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!