

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే నటి పూనమ్ పాండే మరోసారి చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె భారతదేశంలో వ్యభిచారాన్ని వెంటనే చట్టబద్ధం చేయాలని అభిప్రాయపడ్డారు. అలా చేయడం వల్ల మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, లైంగిక దాడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. సినిమాలు, సీరియల్స్ కంటే వివాదాస్పద వ్యాఖ్యలు, బోల్డ్ పబ్లిసిటీతో ఎక్కువగా గుర్తింపు పొందిన ఆమె ఈసారి కూడా తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు.
అంతేకాకుండా, తాను రూపొందించే శృంగార వీడియోలు సమాజానికి మేలు చేస్తున్నాయని పూనమ్ పాండే పేర్కొన్నారు. వాటిని చూడటం వల్ల పురుషులకు మానసికంగా రిలాక్సేషన్ లభిస్తుందని, దాంతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలనే ఆలోచనలు తగ్గుతాయని ఆమె వాదించారు. తన పని ఒక రకమైన సామాజిక సేవలాంటిదని చెప్పడంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళల భద్రత వంటి సున్నితమైన అంశాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పలువురు విమర్శిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!