

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన అనుభవాన్ని తాజాగా పంచుకున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘ఇంద్ర’, ‘మహానటి’, ‘కల్కి 2898 AD’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను నిర్మించిన ఆయన, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘శక్తి’ సినిమా కారణంగా దాదాపు రూ.32 కోట్ల నష్టం చవిచూశానని వెల్లడించారు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఈ నష్టం తనను మానసికంగా తీవ్రంగా కలిచివేసిందని, ఒక దశలో సినీ పరిశ్రమను పూర్తిగా వదిలేయాలనే ఆలోచన కూడా వచ్చిందని అశ్వినీదత్ తెలిపారు. ‘శక్తి’ తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు మరో సినిమా చేయలేదని చెప్పారు. అయితే చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ వంటి భారీ విజయాలతో వైజయంతీ మూవీస్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!