
రాజకీయాలు

ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలపై పలు ఊహాగానాలు వినిపించాయి. లోకేష్ కనగరాజ్, మోహన్ రాజా, కొరటాల శివ వంటి దర్శకులతో సినిమాలు ఉంటాయన్న ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగినా స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బృందం అధికారికంగా స్పందిస్తూ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వార్తలను ఖండించింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి సినిమాకే మాత్రమే అంగీకారం ఉన్నట్లు తెలిపింది. అలాగే తక్షణం కొత్త సినిమాలు ప్రారంభించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయితే ఓజీ 2 గురించి భవిష్యత్తులో సమాచారం ఇవ్వవచ్చని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!