
జనరల్

తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. 50కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు నిర్మాతగా కొత్త అడుగు వేశారు. ‘కేయూరి ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిత్యామీనన్.. తొలి ప్రయత్నంగా లియో విజన్ సంస్థతో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నారు. నిర్మాతగా నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్గానూ నటిస్తున్నారు. డీకే కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఫాంటసీ, డార్క్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. టైటిల్తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!