

నటీనటుల సమిష్టి కృషితో రూపొందుతున్న నయనతార ప్రధాన పాత్రలోని తాజా దివ్యాత్మక చిత్రం ‘మూకుతి అమ్మన్ 2’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ఒక రోజు ముందే చిత్ర యూనిట్ సభ్యులు సెట్స్లో కేక్ కట్ చేసి ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆనందంగా జరుపుకున్నారు.
సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఇషారి కె. గణేష్ నిర్మించారు. నయనతార మరోసారి శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా, ఈ సినిమా తెలుగులో ‘మహాశక్తి’ అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో దునియా విజయ్, రేజీనా, యోగిబాబు, ఊర్వశీ, అభినయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే తొలి భాగమైన ‘మూకుతి అమ్మన్’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) 2020లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఆ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, ఇప్పుడు సీక్వెల్పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!