

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఘన విజయం సాధించిన తర్వాత ‘కల్కి-2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో సుమతి పాత్రను రెండో భాగం నుంచి తొలగిస్తున్నారనే ప్రచారంతో పాటు, ఆ పాత్ర కోసం దీపికా పదుకొణె స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ పుకార్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా స్పందిస్తూ వాటిని పూర్తిగా ఖండించారు. ‘కల్కి’ కథలో సుమతి పాత్ర అత్యంత కీలకమైందని, అలాంటి పాత్రను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే సాయి పల్లవిని సంప్రదించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇప్పటికే ‘కల్కి-2’కు సంబంధించిన రెండు కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయని, సెప్టెంబర్ నుంచి నిరంతరాయంగా షూటింగ్ కొనసాగించి మిగిలిన భాగాన్ని వేగంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!