

రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ ఆనందోత్సాహాలతో వెలిగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులు పద్మ అవార్డులకు ఎంపిక కావడం సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఈ జాబితాలో సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లు పద్మశ్రీ అవార్డులు అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ విజయాన్ని మరింత గుర్తుండిపోయేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి.

చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ల నివాసాలకు వెళ్లి వారికి సాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ముగ్గురి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు దశాబ్దాల అనుబంధాన్ని ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా కూడా చిరంజీవి పద్మ అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సహచరుల పట్ల ప్రేమ, గౌరవంతో పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలుస్తూ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!