

సూపర్ స్టార్ మహేశ్బాబు, దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లో మహేశ్బాబు, ప్రియాంకా చోప్రా పై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక యాక్షన్ ఎపిసోడ్ను ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోందని సమాచారం.
రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కిస్తుండగా, మహేశ్బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. కొన్ని సన్నివేశాల్లో ప్రత్యేక గెటప్తో సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తుండగా, కె. ఎల్. నారాయణ, ఎస్. ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో నెలరోజుల పాటు కొనసాగే భారీ యాక్షన్ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!