
సినిమాలు

సినీ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి కలిసి ‘ఐక్య ధైర్య సేన సమితి’ పేరిట కొత్త ట్రస్ట్ను ప్రారంభించారు. సామాజిక సేవా కార్యక్రమాలు, నిరుపేదలకు సహాయం, చిన్నారుల విద్యాభివృద్ధి లక్ష్యంగా ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ ట్రస్ట్ తొలి అడుగుగా ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకొని, వారి పూర్తి విద్యా బాధ్యతలను భరిస్తామని మంచు మనోజ్ వెల్లడించారు. భవిష్యత్తులో కూడా మరింత మంది పిల్లలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!