

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి చిత్రానికి ‘ పాదయాత్ర ’ అనే టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. లెజెండరీ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి – అదూర్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న నాలుగో సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో ఇంద్రాన్స్, గ్రేస్ ఆంటోనీ, శ్రీష్మ చంద్రన్, జీనత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మమ్ముట్టి కంపెనీ, దుల్కర్ సల్మాన్కు చెందిన వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలను అదూర్ గోపాలకృష్ణన్ స్వయంగా కె.వి. మోహన్ కుమార్తో కలిసి అందించారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ముజీబ్ మజీద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదిలా ఉండగా, మమ్ముట్టి నటిస్తున్న మరో మల్టీస్టారర్ చిత్రం ‘ పేట్రియాట్ ’ కూడా ఏప్రిల్ 23 న విడుదలయ్యే అవకాశముందని మలయాళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!