

టాలీవుడ్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. విలేజ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించగా, హీరో కిరణ్ అబ్బవరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం సినిమా క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఎన్నో దారుణ సంఘటనలు విన్నప్పటికీ, ఈ సినిమా యూనిట్ తనకు క్లైమాక్స్ చెప్పినప్పుడు తాను నిజంగా షాక్ అయ్యానని ఆయన అన్నారు. “ఇలాంటి దారుణాలు నిజంగానే జరిగాయా?” అని తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.
అలాగే, ఆ సంఘటన జరిగిన ఊరి ప్రజలే మొదటగా ఆ బాధను అనుభవిస్తారని, ఇలాంటి విషాదం తమ ఊరిలో జరిగిందని ఇతరులకు చెప్పుకోవడానికే వారు ఇబ్బంది పడతారని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వేణు ఉడుగుల మరియు రాహుల్ మోపిదేవి నిర్మించారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాను నవంబర్ 21న గ్రాండ్గా విడుదల చేయనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!