
సినిమాలు

నటి కాజల్ అగర్వాల్ సమాజంలో మగవారిపై పెరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి ఘటనలను ప్రస్తావిస్తూ, భార్యల చేతిలో భర్తలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు పెరుగుతున్నాయని ఆమె అన్నారు. ఒక తల్లిగా ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడిని పెంచడం పట్ల భయం వేస్తోందని తెలిపారు. హింసకు లింగభేదం లేదని, మగవాళ్లు కూడా బాధితులవుతారని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
అందరికీ లింగభేదం లేకుండా సమాన న్యాయం జరగాలని కాజల్ స్పష్టం చేశారు. భార్యాభర్తల మధ్య తలెత్తే సమస్యలను ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సౌత్ సినిమాల్లో మహిళల ప్రదర్శనపై ఉన్న విమర్శల గురించి స్పందిస్తూ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. సినిమా నిర్మాణంలో మంచి మార్పులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!