

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘ఫౌజ్’ చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో ‘ది రాజాసాబ్’ విషయంలో ఎదురైన షాక్ తర్వాత ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి భారీ ప్రాజెక్టులు కూడా త్వరలో షూటింగ్ దశలోకి వెళ్లనున్నాయి.
ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మైథాలజికల్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్లో లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్పై ప్రభాస్ పూర్తిగా ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘ఆదిపురుష్’ ఫలితం తర్వాత మైథాలజీ సబ్జెక్ట్స్ విషయంలో ప్రభాస్ మరింత ఆలోచనతో ముందుకు వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!