

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ఆదర్శ కుటుంబం” ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారుతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మరోసారి నివేదా పేతురాజ్ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు ఉండటం తెలిసిందే. “అల వైకుంఠపురంలో” సినిమాలో పూజా హెగ్డేతో పాటు నివేదా పేతురాజ్ కూడా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది.
ఇప్పుడు అదే తరహాలో మరోసారి ఆమెకు ప్రాధాన్యత ఉన్న పాత్రను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా, నివేదా ఎంపికపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!