

యంగ్ నటులు అన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన తాజా యూత్ఫుల్ ఎంటర్టైనర్ హుషార్ పిట్టలు. బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న భారీగా విడుదల చేయనున్నాయి. ఇప్పటికే విడుదలైన కంటెంట్కు మంచి స్పందన రావడంతో సినిమాపై యువతలో అంచనాలు పెరిగాయి.
ప్రీ-రిలీజ్ ఈవెంట్లో వాసవి గణేషన్ మాట్లాడుతూ, ప్రివ్యూ షోలలో ప్రేక్షకులు సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. తమ కష్టానికి మంచి ఫలితం దక్కుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెద్ద వయసు మహిళలు తమ మనవరాళ్లతో కలిసి సినిమా చూసి, ఇది మంచి సందేశం ఇచ్చే చిత్రమని ప్రశంసిస్తున్నారని చెప్పారు. కొంతమంది యువ ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత తమ కుటుంబాలను మరింత మంచిగా చూసుకుంటామని చెబుతున్నారని వాసవి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!