

టాలీవుడ్లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు మేకర్స్ భారీ ప్రమోషనల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అయితే, హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రమోషన్లలో కనిపించకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ నుంచి సౌత్పై దృష్టి పెట్టిన జాన్వీ ఈ సినిమాలో డీగ్లామర్ పల్లెటూరి పాత్రలో నటిస్తోంది. కానీ ప్రమోషనల్ వీడియోల్లో ఆమె కనిపించకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఇదే సమయంలో ఆమె కేవలం రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుందని, పాత్ర లెంగ్త్ తక్కువగా ఉండటంతో ప్రమోషన్లకు దూరంగా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మేకర్స్ “పెద్ది పవర్ ప్లే టూర్” పేరుతో దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్లు ప్లాన్ చేశారు. ఈ నెల 18 న ముంబైలో ట్రైలర్ లాంచ్ జరగనుండగా, ఈ నెల 22 న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఈవెంట్స్ జరగనున్నాయి. వచ్చే నెల 2 న హైదరాబాద్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్తో ప్రమోషన్లు ముగియనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!